1/06/2015

సాములందరూ చేరి

సాములందరూ చేరి సంతకెళ్ళారు.
శబరిగిరీశుని సమారాధనకు సరకులు తీసుకున్నారు.
ఆహార్యం నలుపు.. ఆహారం సాత్వికం..
                                                   (ఫోటో శబరిమల డాట్ ఓఆర్జీ సౌజన్యంతో)

స్వామి స్వామి అంటూ సాటి మనిషిలో హరిహరాదులను చూస్తూ
సామూహిక పడిపూజ వేళ కలసి భిక్ష చేస్తూ
మండల కాలం పూర్తి కానున్న వేళ తలపై ఇరుముడితో
పెద పాదం, చినపాదమేదైనా కానీ
భారం హరిహరసుతునిదే అని భావించి
పంపా నదిని చేరి పరమ పావన నదిలో స్నానాలు చేసి
ఆదిలోనే దర్శనమిచ్చిన గణపతికి మొక్కి
శరణు శరణు అంటూ పద్దెనిమిది మెట్లెక్కి
దివ్య కాంతులతో వెలుగుతున్న అయ్యప్పకు మొక్కి
మొక్కుల్లు తీర్చుకొని
మరుసటేడాది మళ్ళీ నీ దర్శనమీయవయా అని వేడుకొని
ఆధ్యాత్మిక ప్రపంచాన్ని వీడి ఐహిక ప్రపంచంలోకి అడుగుపెట్టి
సాంసారిక జీవనంలో తలమునకలైపోయే మనిషి
కష్టమొచ్చిన వేళ తలచుకొనును అయ్యప్ప.. అయ్యప్ప అని..

1 comment:

  1. స్వామియే శరణం అయ్యప్ప......!!

    ReplyDelete