1/12/2015

నా రాతల వెనుక రాజేంద్రప్రసాద్

మానవ సంబంధాలతో పెనవేసుకున్న కథలకు జోరైన సాహిత్యం, హుషారైన సంగీతాన్ని జోడించి సినిమాలు తీసిన దర్శక, నిర్మాత వి.బి.రాజేంద్ర ప్రసాద్ ధనుర్మాసంలో సోమవారం నాడు 'దైవ సన్నిధానానికి' వెళ్ళిపోయారు. వీబీ కారణంగానే ఒకప్పటి ఫేమస్ ఫిల్మ్ మేగజైన్ 'విజయచిత్ర' నుంచి ఫస్ట్ టైమ్ రెమ్యునరేషన్ అందుకున్నాను. బిజినెస్‌లో నష్టపోయి ఖాళీగా ఉన్న కొడుకు జగపతిబాబును సినిమా హీరోగా ఇంట్రడ్యూస్ చేయడంలో ఊహించడానికి సైతం వెనుకాడే ఒక సాహసానికి ఆయన పాల్పడ్డారు.
                                                       ఫోటో: యూ ట్యూబ్ డాట్ కామ్ సౌజన్యంతో

ధర్మేంద్ర, సంజయ్ దత్, మాధురీ దీక్షిత్‌లతో హిందీలో వచ్చిన 'ఖత్రోంకే ఖిలాడీ' సినిమాను తెలుగులో రీమేక్ చేయాలనుకున్నారు. హిందీలో ఇద్దరు హీరోలుగా సంజయ్ దత్, మరో యాక్టర్ నటించారు. తెలుగులో 'సింహస్వప్నం' గా రీమేక్ చేసి రిలీజ్ చేశారు. జగపతి బాబు ఫస్ట్ సినిమా. పైగా డబుల్ యాక్షన్. కృష్ణంరాజు, జయసుధ ఇలా జగపతిబాబుకు అండగా చాలా మంది పెద్దలు సినిమాలో నటించారు. హై ఎక్స్‌పెక్టేషన్స్‌తో వచ్చిన ఆ సిని‌మా అంతగా ఆడలేదు.

'సింహస్వప్నం' మీద రివ్యూ రాసి విజయచిత్రకు పంపించాను. పబ్లిష్ అయ్యింది. నాకో వంద రూపాయలు వచ్చాయి. ఇదేదో బాగుందే అనిపించింది. అప్పట్నుంచి ఏదో ఒకటి రాస్తూనే ఉన్నా. అలా రాసినవి ఏదో ఒక దాంట్లో పడుతూనే ఉన్నాయి. ఆ విధంగా తన సినిమాతో నా అభ్యున్నతికి పరోక్షంగా కారకులైన వి.బి.రాజేంద్ర ప్రసాద్‌‌ నాకు చిరస్మరణీయులు.

No comments:

Post a Comment