బాలచందర్ను వెతుక్కుంటూ గణేశ్ పాత్రో వెళ్ళిపోయాడు. బాలచందర్ తీసిన చాలా సినిమాలకు పాత్రో డైలాగులు రాశాడు. బహుశా అందుకేనేమో ఆ అనుబంధంతో ఆయన వెళ్ళిపోయిన కొద్దిరోజులకే అంటే జనవరి ఐదో తేదీన కన్నుమూశాడు. అభిమానించేవారిని ఏకవచనంతో సంబోధించడంలో తప్పులేదనుకుంటాను. అప్పుడే రాసే అక్షరాల్లో అసలైన అభిమానం తొంగి చూస్తుందనుకుంటా.
ఎడమ వైపు నుంచి గణేశ్ పాత్రో, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కె.బాలచందర్ ('ఈటీవీ' సౌజన్యంతో)
ఒక సినిమా వెనుక ఎవరెవరు ఉంటారా అనే ఇంట్రెస్ట్ పుడుతున్న రోజుల్లో 'స్వాతి' సినిమా వచ్చింది. తల్లికి కూతురు పెళ్ళి చేయడమనే కాన్సెప్ట్తో వచ్చిన ఆ సినిమా అప్పట్లో దుమ్ములేపింది. ఆడాళ్లంతా థియేటర్ల ముందు క్యూ కట్టారు. క్రాంతి కుమార్ డైరక్షన్లో వచ్చిన ఆ సినిమాకు గణేశ్ పాత్రో డైలాగులు రాశాడు. స్టోరీ కూడా అతడిదే అనుకుంటా. తల్లిగా శారద, కూతురుగా సుహాసిని పోటీ పడ్డారు. కాసిని అవార్డులు కూడా వచ్చాయనుకుంటా. అప్పట్లో సినిమాల డైలాగ్ క్యాసెట్లు కొనుక్కొని ఇళ్లల్లో, టీ స్టాళ్లు, కాకా హోటళ్ళ దగ్గర వినడమంటే జనాలకు మహా ఇష్టంగా ఉండేది. నాకు తెలిసి ఎన్టీఆర్, ఎఎన్నార్ సినిమాలను దాటి 'న్యాయం కావాలి' సినిమా తర్వాత జనాల చెవుల్లో మార్మోగిన సినీ డైలాగుల్లో 'స్వాతి' ఫస్ట్ ప్లేస్లో ఉండింది.
హిట్ కొట్టేసిన క్రాంతి కుమార్, గణేశ్ పాత్రో జోడీ అదే ఊపు మీద సుహాసినితో 'స్రవంతి' అనే సినిమా తీశారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మ్యూజిక్ ఇచ్చాడు. లేడీస్ సెంటిమెంట్తో తీసినాకానీ స్వాతి రేంజ్లో ఆడలేదు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే బాలచందర్ డైరక్షన్ లో వచ్చిన 'మరో చరిత్ర' నుంచి కాంత్రికుమార్ తీసిన 'తొమ్మిది నెలలు' సినిమా దాకా ఆడవాళ్ళను సపోర్ట్ చేస్తూ ఏవైనా సినిమాలు వస్తే వాటికి స్టోరీ డైలాగులు లేకుంటే డైలాగులు గణేశ్ పాత్రోనే రాసుంటాడు అనే ధీమాతో నాలాంటి వాళ్ళు థియేటర్లకు వెళ్ళేవారు కాబట్టి.
బాలకృష్ణ దగ్గరికి వచ్చేసరికి 'ముద్దుల కృష్ణయ్య' లాంటి సినిమాలకు డబుల్ మీనింగ్ డైలాగులు రాసి ఎలాంటి డైలాగులైనా రాస్తానని నిరూపించుకున్నాడు. జీవిత హీరోయిన్గా, రాజశేఖర్ విలన్గా అన్యాయమైపోయిన ఆడదాని గురించి కోడిరామకృష్ణ తీసిన 'తలంబ్రాలు' సినిమాక్కూడా డైలాగులిచ్చాడు. బాలచందర్ పుణ్యమాని గణేశ్ పాత్రోతో డైలాగులు రాయించుకునే అవకాశం అప్పటి సుప్రీంహీరో చిరంజీవికి 'రుద్రవీణ' తో దక్కింది. మాటలు నింపితే చాలు సినిమా పాటలైపోతున్న రోజుల్లో నాగార్జున 'నిర్ణయం' సినిమాకు 'హలో గురూ ప్రేమ కోసమేరా జీవితం' అనే పాట కూడా రాశాడు మన పాత్రో.
'మరో చరిత్ర' సినిమాలో హైదరాబాద్ చేరుకున్న కమల్ హాసన్.. ఫ్రెండ్తో కలిసి మందు పార్టీకి వెళ్లినప్పుడు అక్కడ పార్టీలో ఒకడిగా గ్లాసు పట్టుకున్న పాత్రలో పాత్రో మనకు కనిపిస్తాడు. అలాగే మరికొన్ని సినిమాల్లో కూడా అక్కడక్కడా అలా మెరిసి ఇలా మాయమైపోతాడు. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు' సినిమాక్కూడా ఆయనే రాశాడు. కానీ గణేశ్ పాత్రో స్టామినాతో పోల్చినప్పుడు నిజం చెప్పాలంటే పొడి పొడి మాటలతో, గుండె తడి చెమ్మ తగలని ఆ సినిమా డైలాగులు నాకు అంతగా నచ్చలేదు. సినిమా డైలాగుల గురించి అనుకున్నప్పుడు నేను తప్పకుండా మీకు గుర్తుకొస్తాను సుమా.. అంటూ కనిపించకుండా పోయిన పాత్రో నా జ్ఞాపకాల్లో ఎప్పటికీ ఉంటాడు.
ఎడమ వైపు నుంచి గణేశ్ పాత్రో, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కె.బాలచందర్ ('ఈటీవీ' సౌజన్యంతో)
ఒక సినిమా వెనుక ఎవరెవరు ఉంటారా అనే ఇంట్రెస్ట్ పుడుతున్న రోజుల్లో 'స్వాతి' సినిమా వచ్చింది. తల్లికి కూతురు పెళ్ళి చేయడమనే కాన్సెప్ట్తో వచ్చిన ఆ సినిమా అప్పట్లో దుమ్ములేపింది. ఆడాళ్లంతా థియేటర్ల ముందు క్యూ కట్టారు. క్రాంతి కుమార్ డైరక్షన్లో వచ్చిన ఆ సినిమాకు గణేశ్ పాత్రో డైలాగులు రాశాడు. స్టోరీ కూడా అతడిదే అనుకుంటా. తల్లిగా శారద, కూతురుగా సుహాసిని పోటీ పడ్డారు. కాసిని అవార్డులు కూడా వచ్చాయనుకుంటా. అప్పట్లో సినిమాల డైలాగ్ క్యాసెట్లు కొనుక్కొని ఇళ్లల్లో, టీ స్టాళ్లు, కాకా హోటళ్ళ దగ్గర వినడమంటే జనాలకు మహా ఇష్టంగా ఉండేది. నాకు తెలిసి ఎన్టీఆర్, ఎఎన్నార్ సినిమాలను దాటి 'న్యాయం కావాలి' సినిమా తర్వాత జనాల చెవుల్లో మార్మోగిన సినీ డైలాగుల్లో 'స్వాతి' ఫస్ట్ ప్లేస్లో ఉండింది.
హిట్ కొట్టేసిన క్రాంతి కుమార్, గణేశ్ పాత్రో జోడీ అదే ఊపు మీద సుహాసినితో 'స్రవంతి' అనే సినిమా తీశారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మ్యూజిక్ ఇచ్చాడు. లేడీస్ సెంటిమెంట్తో తీసినాకానీ స్వాతి రేంజ్లో ఆడలేదు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే బాలచందర్ డైరక్షన్ లో వచ్చిన 'మరో చరిత్ర' నుంచి కాంత్రికుమార్ తీసిన 'తొమ్మిది నెలలు' సినిమా దాకా ఆడవాళ్ళను సపోర్ట్ చేస్తూ ఏవైనా సినిమాలు వస్తే వాటికి స్టోరీ డైలాగులు లేకుంటే డైలాగులు గణేశ్ పాత్రోనే రాసుంటాడు అనే ధీమాతో నాలాంటి వాళ్ళు థియేటర్లకు వెళ్ళేవారు కాబట్టి.
బాలకృష్ణ దగ్గరికి వచ్చేసరికి 'ముద్దుల కృష్ణయ్య' లాంటి సినిమాలకు డబుల్ మీనింగ్ డైలాగులు రాసి ఎలాంటి డైలాగులైనా రాస్తానని నిరూపించుకున్నాడు. జీవిత హీరోయిన్గా, రాజశేఖర్ విలన్గా అన్యాయమైపోయిన ఆడదాని గురించి కోడిరామకృష్ణ తీసిన 'తలంబ్రాలు' సినిమాక్కూడా డైలాగులిచ్చాడు. బాలచందర్ పుణ్యమాని గణేశ్ పాత్రోతో డైలాగులు రాయించుకునే అవకాశం అప్పటి సుప్రీంహీరో చిరంజీవికి 'రుద్రవీణ' తో దక్కింది. మాటలు నింపితే చాలు సినిమా పాటలైపోతున్న రోజుల్లో నాగార్జున 'నిర్ణయం' సినిమాకు 'హలో గురూ ప్రేమ కోసమేరా జీవితం' అనే పాట కూడా రాశాడు మన పాత్రో.
'మరో చరిత్ర' సినిమాలో హైదరాబాద్ చేరుకున్న కమల్ హాసన్.. ఫ్రెండ్తో కలిసి మందు పార్టీకి వెళ్లినప్పుడు అక్కడ పార్టీలో ఒకడిగా గ్లాసు పట్టుకున్న పాత్రలో పాత్రో మనకు కనిపిస్తాడు. అలాగే మరికొన్ని సినిమాల్లో కూడా అక్కడక్కడా అలా మెరిసి ఇలా మాయమైపోతాడు. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు' సినిమాక్కూడా ఆయనే రాశాడు. కానీ గణేశ్ పాత్రో స్టామినాతో పోల్చినప్పుడు నిజం చెప్పాలంటే పొడి పొడి మాటలతో, గుండె తడి చెమ్మ తగలని ఆ సినిమా డైలాగులు నాకు అంతగా నచ్చలేదు. సినిమా డైలాగుల గురించి అనుకున్నప్పుడు నేను తప్పకుండా మీకు గుర్తుకొస్తాను సుమా.. అంటూ కనిపించకుండా పోయిన పాత్రో నా జ్ఞాపకాల్లో ఎప్పటికీ ఉంటాడు.

నీ రచనా శైలి చాలా బాగుంది. చాలా సున్నితం గా ఎంతో మృదు మధురంగా " గణేష్ పాత్రో " మాటల రచనలలాగా అన్నట్లుగా అంటే సాహసం అవుతుందేమో కానీ, బాగా సాగింది. చాలా మంచి సినిమాలతో కూడిన సందర్భాలతో పాటూ కొన్ని బాల్య స్మృతులనూ గుర్తు చేసావ్. ధన్యవాదములు.
ReplyDeleteనీ వ్యాఖ్యకు ధన్యవాదములు
ReplyDelete