ఒక సినిమా వెనుక ఎవరెవరు ఉంటారా అనే ఇంట్రెస్ట్ పుడుతున్న రోజుల్లో 'స్వాతి' సినిమా వచ్చింది.
తల్లికి కూతురు పెళ్ళి చేయడమనే కాన్సెప్ట్తో వచ్చిన ఆ సినిమా అప్పట్లో దుమ్ములేపింది.
మహిళలంతా థియేటర్ల ముందు క్యూ కట్టారు. వాళ్ళను రిక్వెస్ట్ చేసుకొని టికెట్లు సంపాదించుకోవడంలో మగాళ్లు కనిపించేవారు.
క్రాంతి కుమార్ డైరక్షన్లో వచ్చిన ఆ సినిమాకు గణేశ్ పాత్రో డైలాగులు రాశారు. తల్లిగా శారద, కూతురుగా సుహాసిని పోటీపడి మరీ నటించారు. కంచుకంఠం జగ్గయ్య, కపిల్ దేవ్ ఫ్యాన్ సంయుక్త, శుభలేఖ సుధాకర్ సంగీత కచ్చేరీకి పక్క వాయిద్యాల్లా సినిమాకు పనికి వచ్చారు. స్వాతికి కాసిని అవార్డులు కూడా వచ్చాయనుకుంటా.
అప్పట్లో సినిమాల డైలాగ్ క్యాసెట్లు కొనుక్కొని ఇళ్లల్లో, టీ స్టాళ్లు, కాకా హోటళ్ళ దగ్గర వినడమంటే జనాలకు మహా ఇష్టంగా ఉండేది. ఎన్టీఆర్, ఎఎన్నార్లను దాటి చిరంజీవి 'న్యాయం కావాలి' సినిమా తర్వాత జనాలు అలా డైలాగులు వినడంలో 'స్వాతి' శభాష్ అనిపించుకుంది.
'స్వాతి' హిట్ ప్యాకెట్లో వేసుకున్న క్రాంతి కుమార్, గణేశ్ పాత్రో జోడీ అదే ఊపు మీద సుహాసినితో 'స్రవంతి' అనే సినిమా తీశారు. 'మైక్' మోహన్, శరత్ బాబు సపోర్టింగ్ యాక్టర్లు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మ్యూజిక్ ఇచ్చారు. అయినా కానీ 'స్వాతి' రేంజ్లో ఆడలేదు.
ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే బాలచందర్ డైరక్షన్ లో వచ్చిన 'మరో చరిత్ర' నుంచి కాంత్రికుమార్ తీసిన 'తొమ్మిది నెలలు' సినిమా దాకా ఆడవాళ్ళను సపోర్ట్ చేస్తూ ఏవైనా సినిమాలు వస్తే వాటికి స్టోరీ, డైలాగులు లేకుంటే డైలాగులు గణేశ్ పాత్రోనే రాసుంటారు అనే ధీమాతో నాలాంటి వాళ్ళు థియేటర్లకు వెళ్ళేవారు కాబట్టి.
బాలకృష్ణ దగ్గరికి వచ్చేసరికి 'ముద్దుల కృష్ణయ్య' లాంటి సినిమాలకు డైలాగులు రాసి ఎలాంటి డైలాగులైనా రాస్తానని నిరూపించుకున్నారు పాత్రో.
చిరంజీవి 'రుద్రవీణ' కూ గణేష్ పాత్రో డైలాగులే. ఈ సినిమాలోనూ లేడీస్కు పెద్దపీట వేశారు పాత్రో. వీలుంటే ఓసారి ఆ సినిమా చూడండి లేదంటే గుర్తు చేసుకోండి. హీరోయిన్ శోభనక్కానీ, హీరో వదిన ప్లస్ భావోద్వేగాలు ఆపుకోలేక నాదస్వరం వాయించే ప్రసాద్బాబు భార్యకు పాత్రో రాసిన డైలాగులు సందర్భోచితంగా ఉంటాయి.
జీవిత హీరోయిన్గా, రాజశేఖర్ విలన్గా అన్యాయమైపోయిన అబల గురించి కోడిరామకృష్ణ తీసిన 'తలంబ్రాలు' సినిమాక్కూడా డైలాగులిచ్చారు పాత్రో.
మాటలు నింపితే చాలు సినిమా పాటలైపోతున్న రోజుల్లో నాగార్జున 'నిర్ణయం' సినిమాకు 'హలో గురూ ప్రేమ కోసమేరా జీవితం' అనే పాటతో నేను పాటలు కూడా రాయగలను సుమా అని ప్రూవ్ చేసుకున్నారు.
'మరో చరిత్ర' సినిమాలో హైదరాబాద్ చేరుకున్న కమల్ హాసన్.. ఫ్రెండ్తో కలిసి మందు పార్టీకి వెళ్లినప్పుడు అక్కడ పార్టీలో ఒకడిగా గ్లాసు పట్టుకున్న పాత్రలో పాత్రో మనకు కనిపిస్తారు. అలాగే మరికొన్ని సినిమాల్లో కూడా అక్కడక్కడా అలా మెరిసి ఇలా మాయమైపోతారు.
'సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు' సినిమాక్కూడా ఆయనే రాశారు. కానీ చిన్నప్పటినుంచి ఆయన మాటలు వినీవినీ ఉండటం వల్ల, గణేశ్ పాత్రో స్టామినాతో పోల్చినప్పుడు నిజం చెప్పాలంటే పొడి పొడి మాటలతో, గుండె తడి చెమ్మ తగలని ఆ సినిమా డైలాగులు నాకు అంతగా ఎక్కలేదు. అయితే ఆయనిచ్చిన ఫినిషింగ్ టచ్తోనే సినిమా నిలబడిందని నాకు తెలిసిన కొందరు సినీజనాలు చెబితే.. దటీజ్ గణేశ్ పాత్రో అని మురిసిపోవడం నా వంతుగా మారింది.
సినిమా డైలాగుల గురించి అనుకున్నప్పుడు నేను తప్పకుండా మీకు గుర్తుకొస్తాను సుమా.. అంటూ కనిపించకుండా పోయిన గణేశ్ పాత్రో నా జ్ఞాపకాల్లో ఎప్పటికీ ఉంటారు.
(జూన్ 22: నాటకాలు, సినిమాల రైటర్ గణేశ్ పాత్రో జయంతి.)
--- మహేష్ ధూళిపాళ్ళ
తల్లికి కూతురు పెళ్ళి చేయడమనే కాన్సెప్ట్తో వచ్చిన ఆ సినిమా అప్పట్లో దుమ్ములేపింది.
మహిళలంతా థియేటర్ల ముందు క్యూ కట్టారు. వాళ్ళను రిక్వెస్ట్ చేసుకొని టికెట్లు సంపాదించుకోవడంలో మగాళ్లు కనిపించేవారు.
క్రాంతి కుమార్ డైరక్షన్లో వచ్చిన ఆ సినిమాకు గణేశ్ పాత్రో డైలాగులు రాశారు. తల్లిగా శారద, కూతురుగా సుహాసిని పోటీపడి మరీ నటించారు. కంచుకంఠం జగ్గయ్య, కపిల్ దేవ్ ఫ్యాన్ సంయుక్త, శుభలేఖ సుధాకర్ సంగీత కచ్చేరీకి పక్క వాయిద్యాల్లా సినిమాకు పనికి వచ్చారు. స్వాతికి కాసిని అవార్డులు కూడా వచ్చాయనుకుంటా.
అప్పట్లో సినిమాల డైలాగ్ క్యాసెట్లు కొనుక్కొని ఇళ్లల్లో, టీ స్టాళ్లు, కాకా హోటళ్ళ దగ్గర వినడమంటే జనాలకు మహా ఇష్టంగా ఉండేది. ఎన్టీఆర్, ఎఎన్నార్లను దాటి చిరంజీవి 'న్యాయం కావాలి' సినిమా తర్వాత జనాలు అలా డైలాగులు వినడంలో 'స్వాతి' శభాష్ అనిపించుకుంది.
'స్వాతి' హిట్ ప్యాకెట్లో వేసుకున్న క్రాంతి కుమార్, గణేశ్ పాత్రో జోడీ అదే ఊపు మీద సుహాసినితో 'స్రవంతి' అనే సినిమా తీశారు. 'మైక్' మోహన్, శరత్ బాబు సపోర్టింగ్ యాక్టర్లు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మ్యూజిక్ ఇచ్చారు. అయినా కానీ 'స్వాతి' రేంజ్లో ఆడలేదు.
ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే బాలచందర్ డైరక్షన్ లో వచ్చిన 'మరో చరిత్ర' నుంచి కాంత్రికుమార్ తీసిన 'తొమ్మిది నెలలు' సినిమా దాకా ఆడవాళ్ళను సపోర్ట్ చేస్తూ ఏవైనా సినిమాలు వస్తే వాటికి స్టోరీ, డైలాగులు లేకుంటే డైలాగులు గణేశ్ పాత్రోనే రాసుంటారు అనే ధీమాతో నాలాంటి వాళ్ళు థియేటర్లకు వెళ్ళేవారు కాబట్టి.
బాలకృష్ణ దగ్గరికి వచ్చేసరికి 'ముద్దుల కృష్ణయ్య' లాంటి సినిమాలకు డైలాగులు రాసి ఎలాంటి డైలాగులైనా రాస్తానని నిరూపించుకున్నారు పాత్రో.
చిరంజీవి 'రుద్రవీణ' కూ గణేష్ పాత్రో డైలాగులే. ఈ సినిమాలోనూ లేడీస్కు పెద్దపీట వేశారు పాత్రో. వీలుంటే ఓసారి ఆ సినిమా చూడండి లేదంటే గుర్తు చేసుకోండి. హీరోయిన్ శోభనక్కానీ, హీరో వదిన ప్లస్ భావోద్వేగాలు ఆపుకోలేక నాదస్వరం వాయించే ప్రసాద్బాబు భార్యకు పాత్రో రాసిన డైలాగులు సందర్భోచితంగా ఉంటాయి.
జీవిత హీరోయిన్గా, రాజశేఖర్ విలన్గా అన్యాయమైపోయిన అబల గురించి కోడిరామకృష్ణ తీసిన 'తలంబ్రాలు' సినిమాక్కూడా డైలాగులిచ్చారు పాత్రో.
మాటలు నింపితే చాలు సినిమా పాటలైపోతున్న రోజుల్లో నాగార్జున 'నిర్ణయం' సినిమాకు 'హలో గురూ ప్రేమ కోసమేరా జీవితం' అనే పాటతో నేను పాటలు కూడా రాయగలను సుమా అని ప్రూవ్ చేసుకున్నారు.
'మరో చరిత్ర' సినిమాలో హైదరాబాద్ చేరుకున్న కమల్ హాసన్.. ఫ్రెండ్తో కలిసి మందు పార్టీకి వెళ్లినప్పుడు అక్కడ పార్టీలో ఒకడిగా గ్లాసు పట్టుకున్న పాత్రలో పాత్రో మనకు కనిపిస్తారు. అలాగే మరికొన్ని సినిమాల్లో కూడా అక్కడక్కడా అలా మెరిసి ఇలా మాయమైపోతారు.
'సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు' సినిమాక్కూడా ఆయనే రాశారు. కానీ చిన్నప్పటినుంచి ఆయన మాటలు వినీవినీ ఉండటం వల్ల, గణేశ్ పాత్రో స్టామినాతో పోల్చినప్పుడు నిజం చెప్పాలంటే పొడి పొడి మాటలతో, గుండె తడి చెమ్మ తగలని ఆ సినిమా డైలాగులు నాకు అంతగా ఎక్కలేదు. అయితే ఆయనిచ్చిన ఫినిషింగ్ టచ్తోనే సినిమా నిలబడిందని నాకు తెలిసిన కొందరు సినీజనాలు చెబితే.. దటీజ్ గణేశ్ పాత్రో అని మురిసిపోవడం నా వంతుగా మారింది.
సినిమా డైలాగుల గురించి అనుకున్నప్పుడు నేను తప్పకుండా మీకు గుర్తుకొస్తాను సుమా.. అంటూ కనిపించకుండా పోయిన గణేశ్ పాత్రో నా జ్ఞాపకాల్లో ఎప్పటికీ ఉంటారు.
(జూన్ 22: నాటకాలు, సినిమాల రైటర్ గణేశ్ పాత్రో జయంతి.)
--- మహేష్ ధూళిపాళ్ళ




